ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Monday, August 31, 2009

ఎన్ . టి. ఆర్ విద్యాజ్యోతి

"ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న"

ఎన్ . టి. ఆర్ విద్యాజ్యోతి

" ఒక మేధావి మాత్రమే 10 మంది మేధావులను తయారుచేయగలరు "
ఎన్ . టి. ఆర్ ట్రస్టు ద్వారా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల భవిష్యత్‌కు చక్కని మార్గం ఏర్పాటు చేసుకొనేందుకు సహకారాన్ని అందిస్తున్నాం. Manchi భవిష్యత్తుకు జ్ఞానమే సరైన మార్గమని మా నమ్మకం. జ్ఞానం సంపాదించటానికి , వినియోగించటానికి మంచి చదువు చాలా అవసరం.


బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలను విద్యావేత్తలుగా , నాయకులుగా తీర్చి దిద్దటానికి మా ట్రస్ట్ తరుపున హైదరాబాద్ శివారులలో చిలుకూర్ వద్ద అన్ని వసతులు గల స్కూల్ ని 2005 లో 131 మంది పిల్లలతో నెలకొల్పీనాము. గండిపేట వద్ద విశాలమైన భవన సముదాయంతో ఈ స్కూల్ నెలకొల్పాపడినది. పిల్లల చదువుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. విద్యార్ధులంతామంచి ఫలితాలను సాధించాలన్నది మా ధృడ సంకల్పం.

2005 లో 131 మంది విద్యార్ధులతో ప్రారంభించబడి 2006 లో 302 , 2007 లో 487 , 2008 లో 604 ఇప్పుడు 2009 లో 650 మంది విద్యార్ధులకి అభివృద్ధి చెందినది. ప్రస్తుతం ఈ స్కూల్ లో 650 మందికి కాను 402 మంది విద్యార్ధులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తున్నాం.

ఎన్ టి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ samanya ప్రజల జీవితాలలొ మంచి మార్పు కోసం ప్రయతిస్తున్న Seva సంస్థ. మేము అన్ని వర్గాల ప్రజలను కుల, మత , వర్గ భేదాలు లేకుండ అందరిని సమానంగా ఆదరిస్తునాం. వీరిలో కొంతమంది తల్లిదండ్రులను కొల్పోయినవారు. కొంతమంది ఆర్ధికంగా వెనుకబడినవారున్నారు.

మా విన్నపం :
ప్రస్తుత corporate మరియు concept పాఠాశాలల పరిస్తితులలొ మనం కూడ మన పాఠాశాలను అత్యుత్తమ ప్రమణాలతో నిర్వహిస్తున్నాం. దీనికి చాలా ఖర్చు అవుతుంది. దీనికి మన థాతలు ఇచ్చె విరాళాలె మాకు సహాయపడతాయి.

ఒక విద్యాదాతగా మీరు ఒక పేద విద్యార్ధికి ఎన్.టి.అర్ విద్యాజ్యొతి పథకంతో తన జీవితాన్ని మెరుగు పరచె దిశగా సహాయపడవచ్చు. భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తిగా ఎదగటానికి తద్యారా సమాజ అభివ్రుద్దికి మీ వంతు సహయం చేసిన్నట్టు.

ఒక విద్యార్ధికి ఒక సంవత్సరం కాలం చదివించాలంటే హాస్టల్ వసతితో సహా రూ.30000/లు ఖర్చు అవుతుంది. ఈ రూ.30000/లు విరాళాం ఇవ్వటం వల్ల మీరు ఒక విద్యార్ధికి మంచి విద్యను, వసతిని అందించగలరు.
మీ విరాళాలకు ఆదాయపన్ను చట్టంలోని 80జి కింద పన్ను మినహాయీంపు లభిస్తుంది.
మీరు ఈ విరాళను ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్టు పేరు మీద DD లేద Cheque రూపంలో ఇవ్వవచ్చును.

ఇతర వివరాలకు :

శ్రీ పి. రఘురామారావు (సి.ఇ.ఓ)
ఈ మైల్ : ceo@ntrtrust.org
వెబ్ సైట్: www.ntrtrust.org.
మెమోరియల్ ట్రస్టు 040 30699890


"మిత్రులరా
మనం రూ.30000/లు ఇవ్వలి అని లేదు , మన శక్తి కొలది ఎంతైన ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద DD/Cheque పంపగలరు. మీరు మా మీద అభిమానంతో ఒక్క రూ. ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తాము.
"
మీరు మీకు తెలిసిన వారికి మేము వేల్లి కలసి ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్ గురించి వివరించమన్నచో మాకు ఫొనె / ఈమైల్ వివరములు ఇచ్చినచో వేళ్ళి కలసివస్తాము.


:- ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్

Thursday, August 13, 2009

కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాత ఆర్తనాదం .....

అన్నదాత కరువు కోరల్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా లేక ప్రభుత్వాన్ని నడుపుతున్న వారే మొద్దులా ..........

వరుసగా 5 సంవత్సరాలు పుష్కల వర్షాలు పడ్డా ఎందుకు నేటి దుస్థితి దాపురించింది.....రాష్ట్రంలో వున్న మొత్తం మండలాలు ఎన్ని....అందులో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదు అయిన మండలాలు ఎన్ని....ఎన్ని మండలాలలో రైతులు దుక్కులు దున్నారు ,విత్తనాలు విత్తారు ,విత్తిన విత్తనం ఎంత శాతం మొలకేత్తిందో ఏలిన వారికి ఎరుకేనా ......అస్సలు ప్రభుత్వం దగ్గర వాస్తవ ఆధార సమాచారం వుందా లేక "సాక్షి" పత్రికలో వచ్చే సమాచారమే ప్రభుత్వ సేకరించిన సమాచారంగా ప్రకటిస్తున్నారా ......

వ్యవసాయ రంగం మీద ప్రభుత్వానికి అస్సలు అవగాహన వుందా.....అవగాహన వుంటే ఏ పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు ,ఏ పంటకు ఎంత నీరు కావలి, ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుంది,......ఎంత దిగుబడి వస్తుంది .....మద్దతు ధర ఎంత లభిస్తుంది .......మార్కెట్లో వినియోగదారుడికి ఎంతకు దొరుకుతుంది అని ఒక్క సారి ఆలోచిస్తే నేటి దుస్త్తితి వచ్చేదా....ప్రకృతి విపత్తులలో కూడా కృత్రిమ కొరతలు సృష్టిస్తున్న దళారులను ప్రభుత్వం ఎందుకు అదుపుచేయలేకపోతుంది ???? ప్రభుత్వంలోనే దళారులు వున్నందువల్లనా?? లేక నేటి పాలకులే దళారులా???????


రాష్ట్రంలో ఇడుపులపాయ ఒక్కటే వ్యవసాయ క్షేత్రమా....దాని యజమాని అయిన ముఖ్యమంత్రి ఒక్కడే రైతా ........శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాక ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ఎన్ని వేల ఎకరాలు బీడు పడ్డాయో.... ఎందరు రైతు బిడ్డలు రోడ్డున పడ్డారో ......అడ్డగోలు ప్రభుత్వానికి ఎందుకు అర్ధం కావటంలేదు.....

ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆకర్షించటంలో వున్న శ్రద్ద ....కరువును అంచనా వెయ్యటంలో ఎందుకు చూపలేకపోతున్నారు .....సొంత పార్టీలో వున్న వానదేవుడి అనుగ్రహం పొందలేక పోతున్నారా?? ...లేక వాన దేవుడు రాజీనామా చేస్తే అతని బదులు "కరువు రాకాసికి " సభ్యత్వం ఇచ్చారా ...ఏది నిజం?? ..ఏది మీ అస్సలు నైజం??? ........

నాడు అధికారం కోసం చేవెళ్ళ చెల్లెమ్మ దగ్గర నుంచి శ్రీకాకుళం చిన్నోడి దాక పాదయాత్ర చేసారు .....మరి నేడు ఎందుకు గ్రామాలలో మోటారు యాత్ర చెయ్యటానికి కూడా జంకుతున్నారు.....అవసరం తీరిందనా ..లక్ష్యం నేరవేరిందనా ....స్వప్నం సాకారం అయిందనా ..ఎందుకు ?????.......అవునులే నేను ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం నెరవేరింది కదా ... నా కొడుకు కోటీశ్వరుడు అవ్వాలన్న స్వప్నం సాకారం అయిన "సాక్షి"యాలు కనిపిస్తున్నాయి కదా ఇంక సామాన్యుల చింతలు ఎలా కనిపిస్తాయిలే ......

కరువు పరిస్తితులు ఇలాగే వుంటే ...బీళ్ళు ఇలాగె బీటలు వారితే రేపటి సామాన్యుడి పరిస్థితి ఏంటో ఆలోచించారా....జలయజ్ఞ ఫలాలు ఎక్కడ ...మేఘమదానం యొక్క సందేశాలు ఏవి....యజ్ఞంలో మిగిలింది చివరికి బూడిదేనా....మధనంతో జరిగేది రైతులకు అంతర్మదనమేనా .....

పల్లకీలో కూర్చుంటే కాదు పంట పొలాల్లో నడిస్తే తెలుస్తూంది అన్నదాత ఆక్రందన .......నీటి చుక్క కోసం అన్నదాత కన్నీటి చుక్క ఎలా నేల జారుతుందో కనిపిస్తుంది.......అవునులే అన్నదాతల కడుపు మంటలు,కూలింగ్ అద్దాలు పెట్టుకున్న ద్రుతరాస్ట్రులకు ఎలా కనిపిస్తుందిలే ......గడ్డి(పశుగ్రాసం) లేక పశువులు కలేబరాలకి తరలిపోతుంటే... అవినీతి గడ్డి తినే ప్రభుత్వానికి ఆ మూగ జీవాల గోడు ఎలా వినపడుతుందిలే .......

ఎండుతున్న గొంతులతో చలమ గుంతల్లో నీటి కోసం ఆడపడుచులు చేస్తున్న వలస యాత్రలు ....పాద యాత్రలు చేసిన మీకు కనిపించకపోవటం వెనుక వున్న అస్సలు రహస్యం..... మీరు మొదలు బెట్టబోయే "రాజీవ్" మినరల్ నీటి( ఓటు) వ్యాపారమే అనే నిజం మీ నైజం తెలిసిన ఎవరికి అయిన తెలియదనుకుంటున్నారా ..

నాడు అనంతపురంలో అంతులేని క్షామం వచ్చింది అని మీ విదేశీ అమ్మను తెచ్చి అర్ధంలేని ఆవేదన వెల్లగక్కారే ... .... మరి నేడు మీ అంత:పురం మొత్తం అదిక ధరలతో,ఆకలి బాధలతో ,కరువు కరాల నృత్యాలతో కకావికలమవుతుంటే కళ్ళు వుండి చూడలేని దృతరాష్ట్ర పాలన చేస్తున్నావా పా(ప)లకా .......
నాడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటేనే చంద్రబాబుని, ఆత్మహత్య చేసుకో లక్ష రూపాయల ఎక్షగ్రేశియో ఇస్తానన్న వ్యక్తి ,నేడు ఇన్ని రైతు ఆత్మహత్యలకు కారణం అయినందుకు ,ఎన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలి నాయకా ...అవునులే అధికార దాహంతో ఆత్మవంచన చేసుకునే పదవీ వ్యామోహులకు ప్రజల దాహాలు,అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు పడతాయిలే .......

జగం అంతా దోచి పెట్టి నీ జగన్ కోసం,ముడుపుల పాయలో మూటలు కట్టే దానికే నీకు ఓబులాపురం అంత పెద్ద ఘని దొరికింది....... ఇంక జనం యొక్క దీన గాధలు ఎక్కడ పడతాయిలే మీకు ............

బుద్ది మాంద్య వయస్సులో విత్త మంత్రిగా వుండి చెత్త మాటలతో ప్రజా వేదిక పరువు తియ్యటంలో వున్న శ్రద్ద, కరువు రైతుకి ఆర్ధిక సహకారం అందించటంలో లేదంటే ప్రభువుల చిత్త శుద్ది ఏంటో ప్రజలకు ఇట్టే అర్ధం అవుతుంది ......

గల గల పారే "గోదావరి" బాబ్లీ పుణ్యాన వెల వెల పోతున్నా .....బిర బిర పరిగెత్తే కృష్ణమ్మ కర్ణాటక పుణ్యాన కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నా ..తుంగభద్రమ్మ బెంగతో భంగపడుతున్నా...., ఏలిన వారు మాత్రం జలయజ్ఞం చేస్తున్నాము ...ధనయజ్ఞం పుట్టిస్తాము అంటూ చివరికి ప్రజల బతుకులను భగ్నం చేసి బూడిద పూసే ప్రయత్నంలో వున్నారు ....................

కరువు మీద అరుస్తున్న ప్రతిపక్షాలను కరుస్తా అంటూ బెదిరిస్తూ, రౌడీ రాజకీయం చేస్తున్న ప్రభుత్వ పెద్దలను... ఆంధ్రా చౌరస్తాలో వివస్త్రలను చేసి కొట్టే రోజు కోసం ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారు .......

నాడు కరువు రోజుల్లో "నీరు - మీరు " ద్వారా ప్రజాభాగస్వామ్యంతో "జన్మభూమి"లో నీటి ఎద్దడిని ఎలా ఎదురుకున్నామో, నేడు "బారు --బీరు" ఆదాయం మీద ఆధార పడ్డ ప్రభుత్వానికి తెలిసి రావాలని ...... నేడు అలాంటి చిత్తశుద్దితో ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చెయ్యాలి అని అర్దిస్తున్నా ..........
ఇట్లు
మీ రైతుబిడ్డ

Tuesday, August 11, 2009

ప్రజలకి సైన్ ఫ్లూ ...పాలకులకు మైండ్ ఫ్లూ ???

కరువు రైతుల ప్రాణాలు తీస్తుంది . దుక్కిచేసి , నారు పోసి , సాగుచేసి , వానకోసం ఎదురు చూసి .... కళ్ళముందే పంట ఎండి పొగా , చేసిన అప్పులు పెనుబారమయే , తీర్చే దారి కాన రాక , ఎండిన పొలాల్లోనే రైతులు ఆత్మ హత్య చేసుకుంటున్నారు .





కళ్ళ ఎదుట నిజాలు కనపడుతుంటే... అధికారం అనే మత్తులో వున్నా ఈ రాజకీయ నాయుకుల ( రైతుల కోసమే మేము అని చెప్పుకొనే ) ప్రగల్బాలు చుడండి ...

తాగి అప్పులు పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులు - MP , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రభువులు ఇలా మాట్లాడటం ఇదే మొదట సారి కాదు :

రైతులు తిన్నది అరగక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - బండారు దత్తాత్రేయ
రైతులు తమ బిడ్డల పెళ్ళిళ్ళు సందర్బంగా ఆడంబరాలకు , విలాసాలకు పోయి , పలితంగా అప్పుల పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - జేసి దివాకర్ రెడ్డి

యువత ఆలోచించాలి .... యువత ముందడుగు వేయాలి .... సమర్ద వంతమయిన నాయకత్వాన్ని తీసుకొని రావాలి .

ఇట్లు ,

మీ తోటి యువత

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?